| మహిళా బిల్లు ఆమోదం సోనియా చలవే: ఉమాదేవి |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 6:09 [IST] |
 |
|
దుబ్బాక రూరల్,మార్చి 11, ప్రభాత వార్త : చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాజ్యసభలో ఆమోదం పొందేలా ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన కృషి ఎంతో శ్లాఘనీయమని స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ మాజీ ఆర్గనైజర్ మద్దుల ఉమాదేవి అన్నారు. మహి ళలకు అన్ని రంగాల్లోనూ సమున్నత గౌరవం దక్కేలా బిల్లును పెద్దల సభలో ఆమోదింపజేశారన్నారు. బిల్లుకు యుపిఎ, ఎన్డిఎ, కమ్యూ నిస్టు భాగస్వామ్య పక్షాల మద్దతును కూడగట్టడంలో కృతకృత్యురాలైంద న్నారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టే నాటికి మిగతా వారి మద్దతు కూడా పూర్తి స్థాయిలో సోనియా కూడగట్టగలదన్నారు.
తెలంగాణా బిల్లు కూడా ఆమోదం పొందుతుంది మహిళా బిల్లును ప్రవేశపెట్టిన ఘనత సాధించిన సోనియా గాంధీ 4 కోట్ల తెలంగాణప్రజల ఆకాంక్ష లను కూడా తప్పకుండా నెరవేర్చగల రని ఉమాదేవి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ వనరుల దోపిడి, ప్రజలకు జరుగుతున్న అన్యాయం, ఆంధ్రా పాలకుల పెత్తనం తదితర అంశాలన్ని సోనియా క్షుణ్ణంగా పరిశీలించారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తొలి అడుగు అయిన శ్రీ కృష్ణ కమిటీ నివేదికను ఆసరా చేసుకొని రాష్ట్ర ప్రక్రియ కూడా సఫలీకృతం చేస్తుందని పేర్కొ న్నారు.
|
|
|
|
|
|
|