| పిజి పరీక్షల షెడ్యూల్ విడుదల |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 5:54 [IST] |
 |
|
వరంగల్, మార్చి 11, ప్రభాతవార్త : కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని పిజి కళాశాలల్లో బుధవారం వా యిదా పడిన ఎంఎ, ఎంకాం, ఎమ్మెస్సీతదితర పిజి కోర్సుల మొదటి సెమిస్టర్ పరీ క్షల నిర్వహణకు షెడ్యూల్ను పరీక్షల నియంత్రణ విభాగం ప్రకటించింది. 19న ఎం ఎ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంటిఎం, ఎంఎస్డబ్ల్యు, ఎంఎల్ఐసి కోర్సుల్లో మూడవ పేపర్, 22న ఎంకాం (ఎఫ్ఎ), ఎంహెచ్ఆర్ఎం కోర్సుల్లో రెండవ పేపర్ పరీక్ష నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు.
7 నుంచి ఎంసిఎ మొదటి సెమిస్టర్ పరీక్షలు కెయు పరిధిలోని అన్ని కళాశాలల్లో ఏప్రిల్ 7వతేదీ నుంచి ఎంసిఎ తతీయ సం వత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎస్.రాంరెడ్డి, అదనపుపరీక్షల నియంత్రాణాధికారి డాక్టర్ వి.కష్ణారెడ్డిలు తెలిపారు. 7న మొదటి పేపర్, 9న రెండవ పేపర్, 12న మూడవ పేపర్, 15న ఎలెక్టివ్లో నాలుగో పేపర్, 17న ఎలక్టివ్లో ఐదవ పేపర్కు మధ్యాహం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు.
3 వరకు ఎమ్మెస్సీ, ఎంసిఎ పరీక్షల ఫీజు స్వీకరణ కెయు పరిధిలోని అన్ని కళాశాలలోఎంసిఎ తతీయ సంవత్సరంలోరెండవ సెమి స్టర్, ఎమ్మెస్సీకంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరంలో రెండవ సెమిస్టర్ పరీక్ష లకు హాజరుకానున్న విద్యార్థులు ఏప్రిల్ 3వ తేదీలోగా పరీక్షల ఫీజు చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారి కోరారు. రూ.250 అపరాధ రుసుంతో ఏప్రిల్ 9 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు నిచ్చినట్లు పేర్కొన్నారు. ఈ రెండు కోర్సులో సెకండ్ సెమిస్టర్లో రూ.వెయ్యి చొప్పున పరీక్ష ఫీజును చెల్లించాలని సూచించారు.
|
|
|
|
|
|
|