| మహిళా బిల్లుపై బిజెపిలో అసమ్మతి |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 9:10 [IST] |
 |
|
సీట్లు పోతాయేమోనని పురుష ఎంపీల బెంగ అసమ్మతీయులను బుజ్జగించడానికి రంగంలోకి దిగిన అగ్రనాయకత్వం పార్టీ ఎంపీలకు విప్ జారీకి నిర్ణయం న్యూఢిల్లీ, మార్చి 11: మహిళా బిల్లుకు లోక్సభలోని బిజెపి ఎంపీల్లో ఓ వర్గం తమ వ్యతిరేకతను వ్యక్తం చేసి, బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేస్తామని హెచ్చరిం చడంతో అసమ్మతీయుల అస్త్రాన్ని వారిపైనే ప్రయో గించడానికి విప్ జారీచేయడంద్వారావారిని అదుపు చేయాలని పార్టీ నిర్ణయించింది. బిజెపి అగ్ర నాయ కత్వం నష్టనియంత్రణ చర్యల్లో తలమునకలై, పార్టీ పంధాకుఅనుగుణంగా పార్టీఎంపీలతో ఓటు వేయిం చడానికి వారికి విప్జారీ చేయాలని నిర్ణయించింది. పార్టీలో తిరుగుబాటు తలెత్తుతుందన్న భయంతో లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్జైట్లీ,పార్టీ మాజీ అధ్యక్షుడు రాజ్నాధ్సింగ్ సహా పార్టీ అగ్రనా యకులు గురువారం ఉదయం అసమ్మతి ఎంపీ లతో సమావేశమయ్యారు.
బిల్లుపై వారిలో ఏర్ప డిన భయాందోళనలను పోగొట్టడానికి ప్రయత్నిం చారు.లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడింట ఒకవంతు స్థానాలను రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన బిల్లువల్ల చాలామంది పురు షులు తమ స్థానాలను కోల్పోవాల్సివస్తుందని అసమ్మతీయులు భయపడుతున్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రముఖుల్లో యోగి ఆది త్యనాధ్ (గోరక్పూర్ ఎంపీ), కేంద్ర మాజీ మంత్రి హుకుందేవ్ నారాయణ్ యాదవ్, జనతాదళ్ పరివార్కు చెందిన పాత సోషలిస్టు, లోక్సభలో పార్టీ చీఫ్విప్ రమేష్బైస్ ఉన్నారు. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టినపుడు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని కొంతమంది పార్టీ ఎంపీలు బెదిరించినట్లు చెబుతున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడానికి లోక్సభలో 116మంది సభ్యులుగల బిజెపి మద్దతు కీలకం కానుంది.
ధరల పెరుగుదల, అంతర్గత భద్రత అంశాలపై ప్రభుత్వంపై దాడి జరపాలన్న బిజెపి ఎజెండా నుంచి దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్ వ్యూహంలో భాగంగానే మహిళా బిల్లును తీసుకువచ్చారని ఎంపీ యోగి ఆదిత్యనాధ్ పార్టీని హెచ్చరించారు. బిల్లుకు వ్యతిరేకంగా ఆయన ఇంతకుముందే తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈవిషయమై జోషీ, రాజ్నాధ్ వంటి సీనియర్ నాయకులు నచ్చజెప్పిన మీదట చివరకు ఆయన పార్టీ పంధాకు అనుగుణంగా మారే అవకాశముంది. ఇదిలాఉండగా, ప్రభుత్వం తొలుత ఆర్ధిక బిల్లులను ఆమోదించుకోవాలనుకుంటున్నందున, మహిళా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టదని కూడా పార్టీలోని కొంతమంది యోధులు ఆశాభావంతో ఉన్నారు.
|
|
|
|
|
|
|