మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
18న శ్రీకృష్ణ కమిటీ సమావేశం
శుక్ర వారం, మార్చి 12, 2010 , 9:08 [IST]

లగడపాటి మూడో లేఖ
న్యూఢిల్లీ, మార్చి11, ప్రభాతవార్త :
ఈ నెల 18వ తేదీన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ హస్తినలో సమావేశం కానున్నది. హైదరాబాద్‌ పర్యటనలోని అంశాలపై, వివిధ పార్టీలనేతలు అందించిన సమాచారంలో సమీక్షను నిర్వహించనున్నుది.అలాగే ఇప్పటివరకు తమ కార్యా లయానికి వచ్చిన సమాచారాన్నికూడా సభ్యులు పరిశీలించనున్నారు. ఇప్పటివరకు కమి టీకి అత్యధికమైనసమాచారం అందించినవారిలో విజయవాడఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ముందంజలో ఉన్నారు. మూడు విడతలుగా ఇప్పటివరకు 200పేజీలకు పైగా విలువైన సమాచారాన్ని కమిటీకి అందజేశారు.

కేంద్రం నియమించిన జస్టిస్‌ శ్రీకృష్ణ సంప్రదింపుల కమిటీకి విజయవాడ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్‌ తన మూడో లేఖను సమర్పించారు.బుధవారం హస్తినలో మాజీ శాసనసభ్యులు అడుసుమిల్లి జయప్రకాష్‌ ద్వారా సుమారు 30పేజీల లేఖను కమిటీ సభ్యుడు దుగ్గల్‌ కార్యాలయానికి పంపారు. రాష్ట్రం సమైఖ్యంగా ఉండటానికి అవసరమైన చారిత్రాత్మక అవసరం, శాస్త్రీయ కారణాలను లేఖలో పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా 12 అంశాలు చోటుచేసుకున్నాయి.

తెలుగువారి సమైఖ్యతా - రాష్ట్ర విచ్చిన్నత వల్ల జరిగే నష్టాలు,  దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ అత్యధికంగా లక్షకోట్ల పైచిలుకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విధానం. రాష్ట్రం విడిపోతే నదీజలాలు వివాదమయ్యే అవకాశం ఏ విధంగా ఉందో పేర్కొన్నారు.విద్యుత్‌ తయారీ, విభజన సమస్యలు, రాజధానుల నిర్మాణానికి భారీ వ్యయం. హైద రాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు జరగబోయే నష్టాలు, ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధిలో లోటు.రాజకీయఅనిశ్చిత, మరిన్ని ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం, రాష్ట్ర విభజనవల్ల ఆయాప్రాంతాల్లో ఐఎస్‌ఐ, మాఫియా, మావో యిస్టుల కార్యకలాపాలు ఏ విధంగా ఉదృతమవుతాయో కమిటీకి తెలిపారు.

కులమత విభేధాలు ప్రచ్చరిల్లే అవకాశం ఉందన్నారు. వ్యాపార, పారిశ్రామిక అభివృద్ది, ఉద్యోగ అవకాశాల క్షీణత, రాష్ట్ర రెవెన్యూలో లోటు తద్వారా సంక్షేమ అభివృద్ది రంగాల్లో నష్టాలను వివరించారు. తెలంగాణపై మాజీ ప్రధానమంత్రుల అభిప్రాయా లను పొందుపర్చారు.నిజామాబాద్‌లో పండిట్‌ జవహర్‌లాల్‌నెహ్రు ప్రసంగం, ఆరుసూత్రాల పథకం పై మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రసంగాన్ని కూడా  కమిటీకి అందజేశారు.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 వైశ్యులంతా ఓటుహక్కును..
 కొందరు కాంగ్రెస్‌సీనియర్ల..
 తారలు దిగివచ్చిన వేళ...
 కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
 పోలీసు వ్యవస్థలో మార్పులు రావాలి:..
 జగన్‌ ఓదార్పుపై ప్రధాని పిలుపుతో..
 కాశ్మీర్‌లో అన్నివర్గాలతో..
 ఇసి కొత్త కమిషనర్‌గా ఎపి కేడర్‌..
 చట్టసభల్లో రిజర్వేషన్లకోసం..
 అక్రమమైనింగ్‌పై లోక్‌సభలో టిడిపి..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com