మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
ఒఎన్‌జిసి, ఐఒసి ఐపిఒలు ఉండవు
గురు వారం, మార్చి 11, 2010 , 9:05 [IST]

ongcన్యూఢిల్లీ మార్చి 10:- ఒఎన్‌జిసి, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లు వాటాలను విక్రయించే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని పెట్రో లియం శాఖ కార్యదర్శి ఎస్‌ సుందరేషన్‌ బుధవారం నాడు పత్రికలవారికి చెప్పారు.ఇంధ నాల ధర నిర్ణయంలో ప్రభుత్వ అస్పష్టవైఖరి వల్ల తమ కంపెనీ విలువపై ప్రభావం పడుతుందని ఒఎన్‌జిసి, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ భావిస్తున్నది. అందువల్ల ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ను ఇది గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించడం లేదని సుందరేషన్‌ అన్నారు. ఈ రెండు కంపెనీల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌పై అభిప్రా యాలు తెలియచేయాల్సిందిగా 2009 డిసెంబ రులో డిజిన్వెస్ట్‌మెంట్‌ శాఖ పెట్రోలియం శాఖ అభిప్రాయాలను కోరింది.

అయితే చమురు శాఖ ఇంధనం ధరలు, సబ్సిడీలపై ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకునేవరకు పబ్లిక్‌ ఇష్యూ గురించి ఆలోచించరాదని అభిప్రాయ పడింది. అలాగే ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు కూడా ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు అనుకూలంగా లేవని సుందరేషన్‌ భావిస్తున్నారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ బిపిసిఎల్‌, హెచ్‌పిసిఎల్‌ కంపెనీలు తాము విక్రయించే పెట్రోలు, డీజిల్‌, ఎల్‌పిజి, కిరోసిన్‌లను మార్కెట్‌ ధరలకు కాకుండా సబ్సిడీ ధరలకు విక్రయించేలా ప్రభుత్వం చేస్తున్నది.

ఈ కంపెనీలకు వచ్చే నష్టాన్ని మాత్రం భర్తీ చేయడం లేదు. క్రూడాయిల్‌ విక్రయించడం ద్వారా తనకు లభించే నికరధరపై ఒఎన్‌జిసి ఆందోళన చెందుతున్నది. చమురు రీటైల్‌ కంపెనీలకు వచ్చే నష్టాన్ని కొంతమేర భర్తీ చేయడానికి క్రూడాయిల్‌ను రీటైల్‌ కంపెనీలకు తక్కువ ధరకు లభించేలా ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నది. అలాగే సహజవాయువు ధరపై కూడా తుది నిర్ణయం జరగలేదు. అందువల్ల ప్రస్తుతం తమకు అవసరమైన నిధులను రుణసేకరణ ద్వారా తీర్చుకోవాలని రెండు కంపెనీలు భావిస్తున్నాయి.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 కొబ్బరి మార్కెట్‌కు ముందుంది పండగ
 కొల్హాపూర్‌లో గేట్‌వే హోటల్
 మెక్‌డోవెల్‌ హోల్డింగ్స్‌ ఫలితాలు
 రేమండ్‌ వీల్‌ కొత్త వాచ్‌
 బేకర్స్‌ ఇన్‌ నుంచి ఉత్పత్తులు
 బంగారంలో ప్లాటినం లోహాల ఉనికి
 వ్యవసాయరంగానికి భారీ రుణాలు
 ఎయిర్‌ ఇండియాపై ఫిర్యాదు
 పెరిగిన టాటా మోటార్స్‌ అమ్మకాలు
 పెరిగిన ఫిన్‌ ఎయిర్‌ టర్నోవర్‌
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com