| మానవతకే మాయనిమచ్చ |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 12:19 [IST] |
 |
| రంగినేని జగదీశ్వరుడు, కొల్లాపూర్, మహబూబ్నగర్జిల్లా |
|
అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల నాగవైష్టవిని అపహరించుకుపోయి ఎవరూ ఊహించలేని విధంగా అతి దారుణాతి దారుణంగా హత్యచేయడం రాష్ట్ర ప్రజలను భయకంపితులకు గురిచేసింది. విజయవాడకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారి కూతురు వైష్ణవిని కొంతమంది దుర్మార్గులు అపహ రించుకుపోయి హత్యచేయడమే కాకుండా ఫౌండ్రీలోని బాయిలర్లో వేసి ఆమె శరీరాన్ని కాల్చడం సభ్య సమాజాన్నే తలవంచుకునేలా చేసింది.
కక్షలు, కార్పణ్యాలు ఉంటే పెద్ద వారి మీద చూపించుకోవాలి. కోపాగ్ని చల్లార్చుకోవాలంటే చట్టపరంగా న్యాయస్థానాలు ఉన్నాయి. అలా గాకుండా అన్నెంపున్నెం ఎరుగని పసికందుపై చూపడం అతి దారుణంగా భావించుకోవాలి. ఇలాంటి మానవత్వం లేని విధానాలకు పాల్పడే దుర్మార్గులు ఎంతటి వారైనా సరే విడిచిపెట్టకూడదు.
|
|
|
|
|
|
|