మార్చిన వార్తా విశేషాలు - గురు వారం మార్చి   18th 2010 - 7:54 PM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
ఆత్మ పరిశీలన చేసుకోవాలి
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 12:15 [IST]
ఎస్‌ యాదగిరి, నిజామాబాద్‌

ప్రజాస్వామ్య మనుగడకుఎన్నికలు ఆయువుపట్టు. లోగడ జరిగిన ఉపఎన్నికలు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని తమ అమూల్యమైన ఓటు ద్వారా తీర్పు చెప్పారు. పొత్తులను చిత్తుచేశారు. ఇది గమనించిన టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ తీవ్ర నిరాశ నిస్పృ హలకు లోనై తన మాటల తూటాలతో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడితే తప్ప ప్రత్యేక రాష్ట్రంరాదని గ్రహించి ప్రశాం తంగా ఉన్న రాష్ట్రంలో ఉద్యమ పంథాను చేపట్టి విద్వేషా లకు, విధ్వంసాలకు శ్రీకారం చుట్టిన తొలి ముద్దాయి. ఎన్ని కల్లో ఫలితాలు ఎలా ఉన్నాయో తెలిసి  ఈ పంధా ఎన్నుకు న్నారు. ప్రజలిచ్చిన తీర్పు మీద ప్రజాస్వామ్యంమీద అతనికే మాత్రం విశ్వాసంలేదని అతని ఉక్రోష ధోరణి, నియంత పోకడను స్పష్టంచేస్తున్నాయి.

ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే తెలంగాణ అగ్నిగుండంగా మారతుందనడం అతని సంస్కా రాన్ని స్పష్టం చేస్తోంది. రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తే మిగిలేది బూడిదే. విడిపోవాలనే కాంక్ష ఇక్కడి ప్రజల్లో తీవ్రంగా ఉందని, కలసి ఉండాలనే అక్కడి ప్రజలకాంక్ష కేవలం కల్పితమని చెప్పడం అవివేకం. ఇన్నేళ్ల నుంచి ప్రజలంతా కష్టసుఖాలను కలిసి మెలసి పంచుకుంటూనే ఉన్నారు. విభజన రేఖలు గీస్తున్నది సంకుచిత, స్వార్ధ పరనేతలే అన్న భావన సహజంగా వచ్చిందే. తత్ఫలితమే సమైక్యాంధ్రకాంక్ష ఉవ్వెత్తున లేచింది.

ఇదెవరూ కాదనలేని సత్యం. భావోద్వే గాలు ఇక్కడి వారికేగాని అక్కడి ప్రజలకు ఉండవా? సమస్య లుంటే విడి పోవడమే పరిష్కారమా? నేతలు, ప్రొఫెసర్లు, మేధావులు, విజ్ఞులు, న్యాయకోవిదులు ఇది గుర్తించి తీరాలి. పెట్టుబడి దారుల్లో మంచివాళ్ళు, స్వార్ధపరులు ఉన్నట్లే, విభజనవాదుల్లో ఉన్నారు. తెలంగాణ ఏర్పడితే ఇక్కడ పెత్తందార్లులేరని పెట్టుబడిదారులు దోపిడీ చేయరని ప్రజ లకు విభజనవాదులు గ్యారంటీ ఇస్తారా? కనుక ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి.
 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 గాడి తప్పుతున్న ఆర్థిక వ్యవస్థ
 మహిళలు గుర్తించాల్సింది
 శవాలైన వాళ్ళు...
 విత్తన రంగంలో నియంత్రణ
 క్రమశిక్షణ లేని రాజకీయం వృధాయే
 చారిత్రకం
 నమ్మకం లేని శాంతి చర్చలు
 కొత్త అధ్యక్షునికి సవాళ్లు
 వనితా...! ఓ వనితా!!
 ఎట్టకేలకు?
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com