| ఆత్మస్వరూపం |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 12:11 [IST] |
 |
| బి.కె. అజిత |
|
ఆత్మ జ్యోతిబిందు స్వరూపం గలది. ఆత్మజ్యోతి అని అంటారు. ఇది అమిత సూక్ష్మమైన, దివ్య మైన పారలౌకిక వస్తువు. అవినాశీ అయినటు వంటిది. అమరమైనది. దివ్యచక్షువు ద్వారా మాత్రమే కాంచగలిగినటువంటిది. అబేధ్య మయినది. కత్తితో కత్తిరించడానికి వీలుకాదు. గాలిలో తోయడానికి వీలుకాదు, నీటిలో తడవదు, అగ్నితో కాల్చినా కాలదు. చిన్నగానూ, పెద్దగానూ అవదు. నీటిలో మునగదు. ఏదీ అడ్డుకోవటానికి సాధ్యము కాదు. శరీరానికి మరణము ఆసన్నము అయినపుడు శరీరములో నవరంధ్రాల ద్వారా ఏదో ఒకదాని ద్వారా శరీరమును వదలి వెళ్తుంది అని అంటారు.
ఆత్మస్వరూప స్థితి అత్యంత ఉన్నతమైనది. ఈ స్థితిలో ్చఆత్మశక్తి స్వరూ పముగా, శాంతి స్వరూపముగా, పవిత్రతా స్వరూ పముగా, ఆనంద స్వరూపముగా, ప్రేమ స్వరూపముగా, సుఖ స్వరూపముగా ఉండ గలదు. జ్ఞానము, శక్తి, శాంతి, ఆనందము, ప్రేమ, సుఖము అన్నవి మానవ ఆత్మలలోని మూలగుణాలు. ప్రాక్టికల్గా ఈ గుణాలు కర్మల ద్వారా బహిర్గతం కావటమునే స్వరూపము అని అంటారు. ఈ మూల స్థితికే ఆకర్షణీయముగా ఉంటుంది. ఇటువంటి సౌంద ర్యానికి స్వయము భగవంతుడు కూడా ఆకర్షింపబడతాడు అని అంటారు. ఈ ఆత్మ సౌందర్యము వెలకట్టలేనటువంటిది.
దీని కోసమే యోగులు జ్ఞానులు పురుషార్థం చేస్తూ ఉంటారు. శారీరక,జనన,మరణ చక్రములో వచ్చినటువంటి ఆత్మ కాలక్రమేణా దేహాబి మానానికి వశమై తన మూలస్థితిని కోల్పోయిన కారణముగా ఆత్మ సౌందర్యమును కూడా కోల్పోయింది. కోల్పోయిన మూలస్థితిని తిరిగి పొందాలి అంటే దేహములో ఉంటూ కర్తవ్య నిర్వహణ చేస్తూ కూడా దేహాభిమానమును వదల వలసి ఉంటుంది. ఇందు కొరకు సత్స సాంగత్యాన్ని చేయవలసి ఉంటుంది. సదా ఆత్మా భిమానం అయినటువంటి నిరాకార సత్యశివ సుందరుడితో జ్ఞానయోగాల ద్వారా సత్యమైన సాంగత్యము తప్పనిసరి. తద్వారా మూల గుణములు, దివ్యగుణములు ప్రాప్తియై, సర్వ ప్రాప్తి సంపన్నతతో చేయవచ్చు. ఇటువంటి జీవితము ధన్యమైనది కదా.
|
|
|
|
|
|
|