న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8, ప్రభాతవార్త: కేంద్రం నియ మించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల వెల్ల డిలో జాప్యమయ్యే అవకాశాలుస్పష్టంగా కనిపిస్తు న్నాయి. వాస్తవానికి సోమవారమే కమిటీ విధి విధానాలు వెల్లడించాలని కేంద్ర హోం మంత్రి త్వశాఖ నిర్ణయించినప్పటికీతెలంగాణలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడింది. కోర్ కమిటీ ఆమోదం పొందిన తర్వాతే విధివిధా నాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదే శ్లో పరిస్థితులను గాడిలో పెట్టేందుకు కేంద్రం రెండుసార్లుప్రకటనలు చేసినప్పటికీ విఫలమైంది.
ఈ నేపథ్యంలో మరోసారి చేయి కాల్చుకోకూడ దని జాగ్రత్తగా వ్యవహరించి నిర్ణయం తీసుకో వాలని నిర్ణయించుకున్నది. తెలంగాణకు వ్యతిరే కంగా కమిటీ విధి విధానాలు ఉంటే తెలంగాణ అగ్నిగుండంగా మారిపోతుందని కాంగ్రెస్ ఎంపి మధుయాష్కీకేంద్రానికి హెచ్చరించిన తరుణంలో హస్తినపరిస్థితులుతారుమారైపోయాయి. గతంలో డిసెంబరు9,డిసెంబరు23ప్రకటనచేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన పరిస్థితులతో కేంద్రం మరింతఅప్రమత్తమైంది.
అందుకేకోర్కమిటీ ఆమో దంతో వెల్లడిస్తే కొన్ని సమస్యలను అధిగమించవ చ్చనేఅభిప్రాయంకేంద్రంలోఉంది.ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్లో పరిస్థితులను చూసి వేగంగా కమిటీని పనికి పురమాయించటమే మంచిదని భావిస్తు న్నది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను అధ్యయనం చేయబోయే సంప్రదింపుల కమిటీ ఛైర్మన్ జస్టిస్ శ్రీకృష్ణ,ఇతరసభ్యులుకూడా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి చిదంబరంతోచర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుంది. కాలపరిమితి కూడా అందరికి ఆమో దయోగ్యంగానే ఉంటుందని హోంమంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు.